Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో ఎక్కువగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనాల్లో మారుతి సుజుకీకి చెందిన చిన్న కార్లు ఆల్టో మొదటి స్థానంలో నిలిచింది. గత నెలలో ఈ మోడల్ కార్లు 24,751 అమ్ముడయ్యాయి. స్థూలంగా ప్యాసింజర్ వాహనాల్లో ఎక్కువగా అమ్ముడైన వాహనాల్లో మొదటి ఆరు మారుతివేనని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్(సియామ్) శుక్రవారం ఒక రిపోర్టులో వెల్లడించింది. ఆల్టో తర్వాత స్విఫ్ట్, బాలెనో, డిజైర్, వేగానర్, విటారా బ్రెజా వరుస స్థానాల్లో నిలిచాయి. ఏడో స్థానంలో హ్యుందారుకు చెందిన ఎలైట్ ఐ20, ఎనిమిదో స్థానంలో క్రెటా, తొమ్మిదో స్థానంలో గ్రాండ్ ఐ10 నిలిచాయి.