Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వాహన సేవల రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న క్యాబ్ సంస్థ ఓలాకు కర్నాటక ప్రభుత్వం షాకిచ్చింది. క్యాబ్ల నిర్వహణలో నిబంధనలు అతిక్రమిం చినందుకు ఆ సంస్థ లైసెన్స్ను రద్దు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓలా క్యాబ్ సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర రవాణాశాఖఉత్తర్వులు జారీచేసింది. ఓలా సంస్థ ఇటీవల క్యాబ్ సర్వీసు లకు తోడుగా బైక్ సర్వీసులను కూడా కర్నాటకలో ప్రారంభించింది. అయితే దీనికోసం ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదు. దీనిపై ఫిర్యా దులు అందడంతో రవాణా శాఖ దర్యాప్తు చేపట్టింది. నిజమని తేలడంతో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఓలా సంస్థను ఆదేశించింది. అయితే సంస్థ యాజమాన్యం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ప్రభుత్వం ఓలా లైసెన్స్ను రద్దు చేసింది. లైసెన్స్ ఒరిజినల్ పత్రాలను మూడు రోజుల్లోగా రవాణా శాఖకు అప్పగించాలని ఆదేశించింది. ఓలా క్యాబ్ సేవలు 2010లో ముంబయిలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత తన ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరుకు మార్చింది సంస్థ యాజమాన్యం. ఒక్క కర్నాటకలోని బెంగళూరు మైసూరు, మంగళూరు, హుబ్లీ నగరాల్లో ఓలా సుమారు 10వేల క్యాబ్లతో సర్వీసులు నడుపుతోంది.