Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: బ్రిటన్లో అత్యంత ధనవంతుడైన ఆసియావాసులుగా హిందుజా ఫ్యామిలీ నిలిచింది. 2019వ సంవత్సరానికి గాను బ్రిటన్లోని దాదాపు 101 మంది కుబేరుల సంపదను విశ్లేషించిన అనంతరం ఏషియన్ రిచ్లిస్ట్ 2019ని తాజాగా ఇక్కడ ప్రకటించారు. ఈ జాబితాలో హిందుజా కుటుంబం దాదాపు 25.2 బిలియన్ పౌండ్ల సంపదలో బ్రిటల్లోనే ఆసియా కుబేరులుగా నిలిచింది. గడిచన ఏడాది కాలంలో హిందుజాల సంపద దాదాపు 3 బిలయన్ పౌండ్ల మేర పెరిగింది. ఏషియన్ బిజినెస్ అవార్డ్స్ వెల్లడించిన కుబేరుల జాబితాలో భారత్కు చెందిన ఉక్కు దిగ్గజం లక్ష్మి మిట్టల్ అయన కుమారులు ఆదిత్యా మిట్టల్లు రెండో స్థానంలో నిలిచారు. వీరి సంపద విలువ మొత్తం 11.2 బిలియన్ పౌండ్లుగా నిలిచింది. గత ఏడాది కాలంలో వీరి సంపద దాదాపు 2.8 బిలియన్ పౌండ్ల మేర పెరిగింది. ఎస్.పి.లోహియా (పెట్రోకెమికల్స్) జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. బ్రిటన్లోని ఆసియా సంతతికి చెందిన వారి మొత్తం సంపద విలువ దాదాపు 85.2 బిలియన్ పౌండ్లకు దరిదాపుల్లో ఉందని ఈ జాబితా విశ్లేషించింది. ప్రతియేటా పెరుగుతూ వస్తోన్న ఆసియా సంపన్నుల సంపద గడిచిన ఏడాది కాలంలో దాదాపు 5 బిలియన్ పౌండ్లమేర పెరిగింది. ఈసారి వెల్లడించిన జాబితాలో కొత్తగా ఏడుగురు కుబేరులు స్థానం సంపాదించుకున్నారు. వరుస హౌటెల్ బిజినెస్లతో రాణిస్తోన్న జోగింధర్ సాంగర్ ఆయన కుమారుడు గిరీశ్ సాంగర్లు దాదాపు 300 మిలియన్ పౌండ్ల సొమ్ముతో జాబితాలో 40వ స్థానంలో నిలిచారు. ప్రముఖ ప్రవాస వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్పాల్ కుటుంబం దాదాపు 900 మిలియన్ పౌండ్ల సంపదతో జాబితాలో 17వ స్థానంలో నిలిచారు.