Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం స్వల్ప లాభాలతో సరిపెట్టు కున్నాయి. సెన్సెక్స్ 22 పాయింట్లు లాభ పడింది. 38,607 పాయింట్ల వద్ద ముగి సింది. ఇక నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 11,597 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐటీ దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫో సిస్ క్యూ4 ఫలితాలు వెల్లడి కానుండంతో పాటు, తొలిదశ ఎన్నికల పోలింగ్ నేప థ్యంలో ట్రేడింగ్ ఆద్యంతం సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. వీటికి తోడు మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్లను అప్రమత్తత చేయడంతో సూచీలు స్వల్ప లాభాలను సరిపెట్టు కున్నాయి. నిఫ్టీ 50లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫై నాన్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొ రేటరీస్, గెయిల్, ఎస్బీఐ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగి శాయి. రిలయన్స్ 1 శాతానికి పైగా పెరిగింది. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు దాదాపు 2 శాతం లాభపడ్డాయి. అదేసమయంలో వేదాంత, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. వేదాంత దాదాపు 3 శాతం పడిపోయింది. కెయిర్న్ ఇండియా సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవడం ప్రతికూల ప్రభావం చూపింది.సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా ముగిశాయి.
నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్లు నష్టపోయాయి. మిగతావన్నీ లాభాల్లో ముగిశాయి.