Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ షావోమి వ్యవస్థాపకుడు, సీఈవో లీ జున్ తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. లీ జున్ తనకు లభించే భారీ బోనస్ అంతటినీ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కంపెనీ బోనస్ రూపంలో లీ జున్కు 63.66 కోట్ల షావోమి షేర్లు లభించనున్నాయి. వీటి విలువ 961 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.6,631 కోట్లు. ఈ విషయాన్ని షావోమి కంపెనీ బుధవారం రెగ్యులేటరీలకు నివేదించింది. ఈ షేర్ల మొత్తాన్ని లీ జున్ విరాళంగా ఇవ్వనున్నారు. షావోమి కంపెనీ 2010లో ఏర్పాటైంది. హాంగ్కాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో 2018 జూలై 9న లిస్టైంది. ఎక్స్చేంజ్ సమాచారం ప్రకారం.. లీ జున్ తన షేర్లంటినీ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.