Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్ ఫలితాల వెల్లడితో పాటు పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహించడంతో సూచీలు కొద్దిసేపట్లోనే నష్టాల్లోకి వెళ్లాయి. అయితే మిడ్సెషన్ నుంచి కొనుగోళ్ల జోరు కారణంగా ఇండెక్స్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 160 పాయింట్లు లాభపడి 38,767 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11,643 పాయింట్ల వద్ద స్థిరపడింది.