Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రోగనిర్ధారణ ఉపకర ణాల తయారీ దిగ్గజ సంస్థ ట్రాన్సేషియా బయో మెడికల్ సంస్థ రానున్న ఐదేండ్ల కాలంలో దేశంలోని వంద కోట్ల మంది ప్రజలకు చేరువయ్యే దిశగా ముందుకు సాగుతోందని ఆ సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ వజీరానీ తెలిపారు. సంస్థ 40వ వార్షికోత్సవం పురస్కరించుకొని సంస్థ మార్కెట్లోకి మూడు అత్యాధునికి రక్త పరీక్ష యంత్రాలను మార్కెట్లోకి ఆవిష్కరించింది. తమ సంస్థ దాదాపు 14 దేశాలలో విస్తరించి ఉందని.. 105 దేశాలకు తము ఉత్పత్తులను విక్రయిస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తాము రూ.300 కోట్ల టర్నోవర్ను లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. రానున్న నాలుగైదేండ్లలో ఐపీవోకు వచ్చేలా తాము చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన నిబంధనల సూచీలను ప్రజలకు చేరువ చేసే విషయంలో భారత్ 145వ స్థానంలో ఉందని ఆయన తెలిపారు.