Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి 1,100 మంది పైలెట్లు విధులకు దూరం
- మరి కొన్ని సర్వీసుల్ని ఆపేసిన జెట్
- తక్కువ జీతాలతో స్పైస్ జెట్ గాలం
ముంబయి:జెట్ ఎయిర్వేస్లో నెలకొన్న సంక్షోభం మరింతగా ముదురుతున్నది. గత మూడునెలల నుంచి జీతాల్లేక రోడ్డుకెక్కిన పైలెట్లు సోమవారం నుంచి తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. పైలెట్లు అందుబాటులో లేకపోవటంతో.మరికొన్ని సర్వీసులను జెట్ యాజమాన్యం నిలిపివేసింది. మరోవైపు జీతాల్లేక అవస్థలు పడుతున్న ఉద్యోగులను తమ సంస్థలోకి తక్కువ జీతంతో తీసుకునేలా స్పెస్ జెట్ సంస్థ గాలం వేస్తున్నది.
జెట్ ఎయిర్వేస్లో రగడ మరింతగా రచ్చకెక్కుతున్నది. సోమవారం నుంచి దాదాపు 1,100 మంది పైలట్లు ఉదయం 10 గంటల నుంచి విధులకు దూరంగా ఉండనున్నారు. 'పైలట్స్ బాడీ నేషనల్ ఏవియేటర్ గిల్డ్' నిర్ణయం తీసుకొన్నది. కాగా ఇప్పటి వరకూ పైలెట్లు, ఇంజినీర్లు, సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. జనవరి నుంచి వీరికి జీతాలు బకాయి ఉన్నారు. ఇతర కేటగిరిల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా మార్చి జీతాలను చెల్లించలేదు. దీంతో జెట్ ఎయిర్ వేస్ వ్యవహారం రోడ్డు మీదకొచ్చింది.
'' మూడున్నర నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి . అందుకే ఏప్రిల్ 15 నుంచి విధులకు దూరంగా ఉంటున్నాం. ఎన్ఏజీలోని 1,100 మంది పైలట్లు 10 గంటల నుంచి విమానాలను నడపరు.'' అని గిల్డ్ వర్గాలు తెలిపాయి. జెట్ సంస్థలోని మొత్తం 1,600 మంది పైలెట్లలో దాదాపు 1,100 మంది ఎన్ఏజీలో సభ్యులు. జెట్ ఎయిర్వేస్ నిర్వహణ బాధ్యతలను ఇప్పుడు ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం చూస్తున్న విషయం విదితమే. ఈ సంస్థలో స్వతంత్ర డైరెక్టర్గా పనిచేస్తున్న రాజశ్రీ పతి తన పదవికి గుడ్బై చెప్పారు.. ఆయన రాజీనామా ఏప్రిల్ 13 నుంచే అమల్లోకి రానున్నది.
తక్కువ జీతానికి వస్తారా..స్పైస్ జెట్
ఉద్యోగాలు పోయి రోడ్డున పడిన వారు తక్కువ జీతం ఇచ్చినా రెడీ అనటం సహజం. ఇపుడు ఇదే తీరును స్పెస్జెట్ విమానయానసంస్థ గాలం వేస్తున్నది. ప్రస్తుతం ఉన్న జీతం కన్నా 25 నుంచి 50 శాతం వరకు తగ్గింపుతో ఉద్యోగం చేరాలకుంటే..రండని ఆ సంస్థ కాల్ చేస్తున్నది. ఇప్పటికే జీతాల్లేక కష్టాలు పడుతున్నాం..ముందుగా ఎంతోకొంత జీతానికి వేరే ఉద్యోగంలో చేరటానికి కొందరు రెడీ అయిపోతున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు మాత్రం జెట్ ఎయిర్వేస్ సంస్థతో తాడోపేడో తెల్చుకుందామని నిర్ణయించినట్టు ఉద్యోగసంఘాలు అంటున్నారు.
మరికొన్ని సర్వీసులకు బ్రేక్
జెట్ ఎయిర్వేస్ మరికొన్ని కీలక అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. వీటిల్లో తూర్పు ఆసియా దేశాలు ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ సంస్థ పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను సోమవారం వరకు రద్దు చేసింది. తాజాగా సార్క్, ఏషియన్ దేశాలకు వెళ్లే సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్ను ఆపేసినట్టు ఏవియేషన్ రెగ్యులేటరీకి సమాచారం అందజేసింది. వీటిల్లో కొలంబో, ఖట్మాండు, సింగపూర్, హాంగ్కాంగ్లు ఉన్నాయి. వీటి ముందస్తు బుకింగ్స్ను ఎప్పుడు పునరుద్ధరిస్తారో మాత్రం ఇంకా తెలియటంలేదు.
వేసవి సీజన్ కావడంతో జెట్ ఎయిర్వేస్ లండన్ సర్వీసులను ఏప్రిల్ 15 నుంచి పునరుద్ధరించాలని భావిస్తున్నది. దీంతోపాటు యూరప్లోని పారిస్, ఆమ్స్టర్డామ్ మార్గాలకు మళ్లీ విమానాలను నడిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే పైలెట్లు సోమవారం నుంచి విధులకు గైర్హాజరైతే.. అంతర్జాతీయ విమానసర్వీసులు నడవటం అనుమానమేనని ఎవియేషన్ అధికారులు అంటున్నారు.