Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3.18 శాతానికి పెరిగిన డబ్య్లుపీఐ ఆధారిత ఇన్ఫ్లెషన్
న్యూఢిల్లీ: మార్కెట్లో ధరల మంట మండుతుండడంతో టోకు ధరల సూచీ (డబ్ల్యుపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మరోసారి రికార్డు స్థాయిలో పెరిగింది. మార్చి మాసంలో ఇది 3.18గా నమోదైంది. ఇంధన ధరలు, ప్రామాణిక వస్తువుల ధరలు పుంజుకోవడంతో మార్చి నెలలో డబ్ల్యుపీస పెరుగుదలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఇది 2.93 గా నమోదు అయింది. అంతకు ముందు ఏడాది మార్చినెలలో ఇది 2.74 శాతంగా నమోదు అయింది. కూరగాయల ధరలు పెరిగిపోవడంతో ఆహార వస్తువుల ధరల ద్రవ్యోల్బణం పెరిగింది. ఇదే సమయంలో కూరగాయల ద్రవ్యోల్బణ 28.13 శాతంగా నమోదు అయింది. నెలవారీ ప్రాతిపదికన 11శాతం పెరిగింది. అంతకు ముందు నెలలో అది 6.82 శాతంగా ఉంది. మార్చి మాసంలో బంగాళదుంపల ధరలు గణనీయంగా 23.40 శాతం నుంచి 1.30 శాతానికి శాంతించడం విశేషం. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 5.68 శాతం పెరిగింది. చమురు, విద్యుత్తు రంగ ద్రవ్యోల్బణం కూడా 2.23 శాతం నుంచి 5.41 శాతానికి చేరుకుంది. అంతకు ముందు మార్చి మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.57 శాతం నుంచి 2.86 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించనుందన్న వార్తలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.