Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యూజిక్, డైరెక్ట్ కాలింగ్కు అవకాశం
- ప్రత్యేక స్పీకర్లు, బ్యాటరీతో తయారీ..
- మార్కెట్ ధర రూ.2,996
న్యూఢిల్లీ: ప్రముఖ హెల్మెట్ల తయారీ కంపెనీ వేగ 'ఇవో బీటీ' పేరుతో బ్లూటూత్ సదుపాయం కలిగిన కొత్త హెల్మెట్ను మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ.2,996గా కంపెనీ నిర్ణయించింది. ఈ హెల్మెట్ను సీఎస్ఆర్ బ్లూటూత్ చిప్ అమర్చి తయారు చేశారు. లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ వినేందుకు వీలుగా హైడెఫినేషన్ స్పీకర్లను ఇందులో అమర్చారు. దీనిని ఫోన్కు అనుసంధానం చేయడం ద్వారా ఎలాంటి ఇయర్ఫోన్ లేకుండగానే కాల్స్ మాట్లాడుకోవచ్చు, హ్యాండ్స్ ఫ్రీ ఫంక్షన్ దీని ప్రత్యేకతలు. ఈ హెల్మెట్లో వాయిస్ అసిస్టెడ్ నావిగేషన్ ఫీచర్ కూడా ఉంది. ఆటోమేటిక్ కాల్ అన్సరింగ్ ఫీచర్ వల్ల ఫోన్ బటన్ కూడా నొక్కాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కాల్స్ మాట్లాడొచ్చు. ఇందులో బిల్ట్ఇన్ రీచార్జబుల్ లి-అయాన్ బ్యాటరీ ఉంటుంది. హెల్మెట్లో బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎంత చార్జింగ్ మిగిలి ఉందో స్మార్ట్ఫోన్ స్క్రీన్పై చూసుకొనే వీలుంది. ఈ హెల్మెట్ కేవలం నలుపు రంగులో మాత్రమే అందుబాటులో ఉంది. గతంలో స్టీల్బర్డ్ 'ఎస్బీఏ 1 హెచ్ఎఫ్' అనే హెల్మెట్ను హ్యాండ్స్ఫ్రీ హెల్మెట్గా మార్కెట్లోకి తెచ్చింది. అయితే టెక్నికల్గా దానిని బ్లూటూత్ టెక్నాలజీతో కాకుండా యాక్స్ వైర్ ఆధారిత కనెక్టివిటీ సదుపాయాన్ని కల్పించిందిజ దీనికి భిన్నంగా ఇప్పుడు వేగ సంస్థ ఇవో బీటీ హెల్లెట్ను తీసుకురావడం విశేషం.