Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్షణాత్మక విధానాలు జాబ్స్ను కాపాడవు
- దాని వల్ల ఇతర రంగాలకు అపార నష్టం :ఎకోస్కో మీట్లో
- ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్
న్యూయార్క్: అమెరికాతో సహా కొన్ని ఐరోపా దేశాలు ఇటీవల అవలంభిస్తోన్న రక్షణాత్మక విధానాలను ప్రముఖ ఆర్థికవేత్త, భారతీయ రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోమారు తప్పు బట్టారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఎకోస్కో ఫోరమ్ ఆన్ ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాజన్ ప్రసంగిస్తూ కొన్ని దేశాలు పాటిస్తున్న రక్షణాత్మక విధానాలతో ఆయా దేశాలలో ఉద్యోగాలను కాపాడుకుంటున్నామన్న భావనలో ఉన్నాయన్నారు. ఇది తప్పని ఆయన తెలిపారు. ఇలాంటి విధానాల వల్ల కాపాడు కున్న ఉద్యోగాల కంటే ఇతర రంగాల్లో ఆయా దేశాలు కోల్పోతున్న ఉద్యోగాలు, అవకాశాలే ఎక్కువగా ఉంటున్నా యని ఆయన విశ్లేషించారు. ఆటోమేషన్, కృత్త్రిమ మేథస్సు నుంచి ఉద్యోగాలకు ముప్పు పొంచిఉందని వీటి నుంచి కొలువులను కాపాడుకునేందుకు ఆయా దేశాలు ఈ విష యంలో రక్షణాత్మకంగా వ్యవహరించాలని ఆయన సూచిం చారు. రక్షణాత్మక విధానాలను ఎంచుకొనే ముందు ప్రపంచీ కరణ, సాంకేతిక మార్పులకు దూరంగా ఉన్న వర్గాల వారి ప్రజాస్వామిక స్పందనను ఆయా దేశాలు మరవకూడదని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఆయా దేశాలే ప్రధాన మార్కెట్లుగా ఎదుగనున్నాయని ఆయన తెలిపారు. అప్పుడు వ్యాపార అవకాశాలు, మార్కెట్ విస్తరణ కోసం రక్షణాత్మక విధానాలను పాటిస్తున్న దేశాలు మళ్లీ ఈ దేశాలవైపే అడుగులు వేయాల్సి ఉంటుందని ఆయన తెలపారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమలులోకి వచ్చిన ఉదారవాద ప్రజాస్వామిక మార్కెట్ వ్యవస్థ వల్ల గడిచిన ఆరు దశాబ్దాల కాలంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు, అగ్ర రాజ్యాలు బాగా లబ్ధిపొందాయని ఆయన అన్నారు. అయితే ఈసారి ఆశ్చర్యకరంగా ఇందులో కొన్ని దేశాలు తమ దేశ ప్రయోజనాల కోసం రక్షణాత్మక విధానాలను తలకు ఎత్తుకో వడం సబబు కాదని ఆయన అన్నారు. ఆయా దేశాలు ప్రస్తు తం అవలంభిస్తున్న విధానాల వల్ల రానున్న రోజుల్లో అభివృ ద్ధి చెందుతున్న మార్కెట్లలోకి ఆయా దేశాలు వెళ్లి విస్తరించేం దుకు అవరోధం ఏర్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.