Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తోన్న సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎస్ఎఫ్బీ) తెలంగాణలో అడుగుపెట్టింది. బ్యాంక్ తొలి శాఖను హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఎండీ, సీఈవో భాస్కర్ బాబు మాట్లాడుతూ తెలంగాణలో తమ కార్యకలాపాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. మార్కెట్లో ఇతర బ్యాంకుల కంటే పోటీతో కూడిన తక్కువ వడ్డీరేట్లకు తాము రుణాలను అందించనున్నట్టుగా తెలిపారు. తమ బలమైన వ్యాపార విధానం వల్ల తక్కువ వ్యయానికే నిధులను సమీకరించే విలుపడుతుందని.. ఫలితంగా డిపాజిట్ల ఆకర్షణీయమైన వడ్డీతో పాటు రుణాలను సైతం తక్కువ రేటుకు అందిచనున్నట్టుగా ఆయన తెలిపారు. తమ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విభాగంలో రెండేండ్ల కాలాన్ని పూర్తి చేసుకుందని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో కూడా ఆరోగ్యకరమైన వ్యాపారాన్ని కొనసాగిస్తూ తమ ఖాతాదారులకు సంపద సృష్టించే దిశగా తమ వ్యాపారాన్ని ముందుకు సాగించనున్నట్టుగా ఆయన తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో లేని ప్రాంతాలు, తక్కువగా బ్యాంకులకు యాక్సెస్ కలిగిన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని కొత్త తరహాలో దేశ వ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో తమ బ్యాంక్ శాఖలను 382కు చేర్చనున్నట్టుగా ఆయన వివరించారు.