Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశీయ మైనింగ్ రంగ దిగ్గజం నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) బుధవారం తన రెండో సుస్థిర నివేదికను (సస్టైనబులిటీ రిపోర్టు)ను విడుదల చేసింది. 2017-18 ఏడాదికి గాను ''ఎక్స్ప్యాండింగ్ హారిజన్స్- ఫ్రమ్ వోర్ టు స్టీల్'' పేరుతో సంస్థ రూపొందించిన ఈ నివేదికను సంస్థ సీఎండీ ఎన్ బిజేంద్ర కుమార్ విడుల చేశారు. సంస్థ వాణిజ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ టి.ఆర్.కె.రావు, ఉత్పత్తి విభాగం డైరెక్టర్ పి.కె.సత్పతీ, ఆర్థిక విభాగం డైరెక్టర్ అమితవ ముఖర్జీతో పాటు సంస్థ సీనియర్ అధికారుల సమక్షంలో సీఎండీ ఈ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా బిజేంద్ర కుమార్ మాట్లాడుతూ నివేదికను రూపొందించేందుకు విశేషంగా కృషి చేసిన సిబ్బందికి అభినందించారు. సంపద సృష్టి విషయంలో ఎలాంటి మార్పులతో ముందుకు వెళ్లోచ్చనే విషయాన్ని నేర్చుకొనేందుకు, విశ్లేషించుకొనేందుకు ఈ నివేదిక ఎంతగానో దోహదం పడుతుందని తెలిపారు. దీర్ఘకాల వృద్ధితో పాటు ఆర్థిక, పర్యావరణ, సాంఘిక లక్ష్యాలను చేరుకొనేందుకు గాను ఎన్ఎండీసీ సంస్థ తమ అన్ని కార్యకాలాపాల్లో సమతూకం పాటిస్తూ ముందుకు సాగుతోందని సంస్థ ఉత్పత్తి విభాగం డైరెక్టర్ సత్పతీ అన్నారు. స్థిరమైన వృద్ధితో ముందుకు సాగే విషయంలో ఎన్ఎండీసీ అంకిత భావంతో ముందుకు సాగుతోందని ఆయన వివరించారు.