Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 రోజుల తరువాత మెరిసిన మార్కెట్లు
- 490 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
- 11,726 పాయింట్లకు చేరిన నిఫ్టీ
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ ర్యాలీని నమోదు చేశాయి. దేశీయ అనుకూల పరిణామాలకు తోడు కార్పొరేట్ సంస్థల నుంచి సానుకూల ఫలితాలు వస్తుండడం, వరుస నష్టాల కారణంగా మేటి స్టాక్స్ తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో మదుపరులు తాజా కొనుగోళ్లకు తెర తీశారు. దీంతో బెంచ్మార్క్ ఇండెక్స్లు పరుగులు పెట్టాయి. మూడు రోజుల నష్టాల తర్వాత సానుకూలంగా ప్రారంభమైన స్టాక్మార్కెట్లు మిడ్ సెషన్ తరువాత మరింత జూమ్ అయ్యాయి. ఫలితంగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ ఏకంగా 490 పాయింట్లు జంప్ చేసింది. 39,055 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 11,726 పాయింట్ల వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఎనర్జీ స్టాక్స్లో కొనుగోళ్ల జోరు కారణంగా ఇండెక్స్లు భారీ లాభాల్లో ముగిశాయని ట్రేడర్లు వివరించారు. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ షేర్లు 1.5 నుంచి 2.2 శాతం శ్రేణిలో పెరిగాయి. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటకిఈ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం కూడా మార్కెట్పై సానుకూల ప్రభావం చూపింది. దీంతో మార్కెట్ చివరి గంటలో బాగా ర్యాలీని నమోదు చేసింది. నిఫ్టీ 50లో అల్ట్రాటెక్ సిమెంట్, బీపీసీఎల్, హెచ్సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐఓసీ, యస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్ ఏకంగా 6 శాతం మేర పరుగులు పెట్టింది. ఆయిల్ రంగ షేర్లు కూడా లాభపడ్డాయి. అదే సమయంలో టాటా మోటార్స్, హీరో మోటొకార్ప్, మారుతీ సుజుకీ, సిప్లా, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. టాటా మోటార్స్ 3 శాతానికి పైగా నష్టపోయింది. సెక్టోరల్ ఇండెక్స్లన్నీ లాభాల్లోనే ముగిశాయి. అయితే ఒక్క నిఫ్టీ ఆటో ఇండెక్స్ మాత్రం నష్టాల్లోనే ఉండిపోయింది. బ్యాంక్ షేర్లు కళకళలాడాయి. ఐటీ షేర్లు కూడా దూసుకెళ్లాయి. ఆరంభంలో ఊగిసలాడిన కీలక సూచీ చివరి గంటలో లభించిన కొనుగోళ్ల మద్దతు భారీగా లాభపడ్డాయి. అయితే మార్కెట్లు ప్రస్తుతం వాస్తవాలను వదిలి కేవలం అపోహలను, అంచనాలను ఆసరాగా చేసుకొని ముందుకు సాగుతున్నాయని తెలిపింది. అయితే రానున్న రోజుల్లో మార్కెట్లు భారీగా పడిపోయే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.