Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నా: రాజన్
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారం టూ వస్తున్న వార్తలకు ఆయన శుక్రవారం తెర దించారు. ఇప్పట్లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేది తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. తన విలువైన సమయాన్ని కుటుంబం కోసం కేటాయిస్తున్నట్టుగా తెలిపారు. వృత్తిపరంగా ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించానని.. అయితే ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నారు. మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యక్తిగత విషయాలను ఆయన పంచుకొన్నారు. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నమాట నిజమేనని అయితే.. తాను రాజకీయాల్లోకి రావడం తన జీవిత భాగస్వామికి ఇష్టం లేదని తెలిపారు. ఒక వేళ ఆమె మాట కాదని తాను రాజకీయ వస్తే ఆమె తనను వదిలేసి వెళ్లిపో తుందని ఆయన వివరించారు. ప్రస్తుతం రాజకీ యాలు అనే అంశం అంతటా సాధారణమైపో యింది. కొంతమంది బాగా మాట్లా డి ఓట్లు సంపాదించుకో గలరని.. అయితే తనకు ఆ పరిజ్ఞానం లేదని ఆయ న అన్నారు. కాంగ్రెస్ అధి కారంలోకి వస్తే తనకు మంత్రి పదవి దక్కుతుందన్న ఊహాగాల ను వస్తున్నాయని అయితే తాను వాటిని నియంత్రిం చలేనని తెలిపారు. తానెక్కడుంటే అక్కడ వాతావ రణం సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని వెల్లడించారు. ఈ విషయమై రాజన్ మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పెదలకు కనీస ఆదాయ పథకం రూపకల్పనలో కీలక భూమిక పోషించిన రాజన్.. కేంద్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడితే ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నట్టుగా ఇటీవల భారీగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.