Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మొబైల్ డేటా, స్మార్ట్ఫోన్లు అందుబాటు ధరలకు మార్కెట్లో లభిస్తుండడంతో దేశీయంగా వీటి వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది (2019) తొలి త్రైమాసిక కాలంలో (జనవరి-మార్చి) వివిధ మొబైల్ కంపెనీలు 31 లక్షల స్మార్ట్ఫోన్లను భారత్ మార్కెట్లో విక్రయించాయి. వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నట్టుగా ప్రముఖ పరిశోధన అధ్యయన సంస్థ కౌంటర్పాయింట్ తెలిపింది. అయితే, మొత్తంగా చూస్తే, ఆశించిన దాని కన్నా అమ్మకాల వృద్ధి రేటు కాస్త తక్కువగానే ఉందని పరిశోధన విశ్లేషకుడు అన్షికా జైన్ తెలిపారు. వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను అందించేందుకు అన్ని మొబైల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు. 'తొలి త్రైమాసికంలో అన్ని ప్రముఖ మొబైల్ కంపెనీలు ఆఫ్లైన్ వేదికగా తమ అమ్మకాలను పెంచుకునే దిశగా అడుగులు వేశాయి' అని జైన్ పేర్కొన్నారు. అయితే, ఫీచర్ఫోన్ల గణాంకాలను మాత్రం కౌంటర్ పాయింట్ వెల్లడించలేదు. మార్కెట్ వాటాలో జియో 30 శాతం ఉండగా, శాంసంగ్ 15 శాతం, లావా 13 శాతం, నోకియా 8శాతం, ఐటెల్ 7శాతం ఉంది. ఇక అత్యధికంగా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ల విషయంలో షామీ 30 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, శాంసంగ్ 23 శాతం, వీవో 12 శాతం, రియల్మి, ఒప్పోలు 7 శాతం స్మార్ట్ఫోన్లను భారత్కు తీసుకొచ్చాయి. భారత మార్కెట్లో చైనా మొబైల్ కంపెనీల వాటా 66శాతంగా ఉందని నివేదిక తెలిపింది. ఇక ప్రీమియం మొబైళ్ల విషయంలో వన్ప్లస్ను శాంసంగ్ దాటేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10 సిరీస్కు విశేష ఆదరణ లభించడమే ఇందుకు కారణమని కౌంటర్ పాయింట్ పేర్కొంది.