Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు ఎగిరిపోయి లండ్న్లో తల దాచుకుంటున్న లిక్కర్ డాన్ విజరు మాల్యా సామాజిక మాద్యమం ట్విట్టర్ ద్వారా మరోమారు తన ఆవేదనను వెల్లగక్కారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కు సంబంధించి తాము చేసిన రుణాల మొత్తాన్ని బ్యాంకులకు 100 శాతం తిరిగి చెల్లిస్తానంటూ ఆయన సోమవారం వరుస ట్వీట్లు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్కోసం తీసుకున్న మొత్తం రుణాన్ని చెల్లించడం కోసం తాను సిద్ధంగా ఉన్నా.. బ్యాంకులు ఎందుకు అంగీకరిచడంలేదో తనకు అర్థం కావడం లేదని ఆయన వాపోయారు. జెట్ ఎయిర్వేస్ దుస్థితిపై టీవీల్లో చర్చల్ని చూశానని.. ముఖ్యంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి కష్టాలు బాధాకరమని మాల్యా పేర్కొన్నారు. కొన్ని వ్యాపార తప్పిదాల వల్ల కింగ్ ఫిషర్తోపాటు భారతీయ విమానయాన సంస్థలు కుప్పకూలుతుండడం విచారకరమని ఆయన అన్నారు. తాజాగా అనూహ్య రీతిలో జెట్ పతనమవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను 100శాతం రుణాలు చెల్లించేస్తానని చెబుతున్నా.. సీబీఐ, ఈడీ తనపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తనకే ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కావడం లేదంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత విచారణ అధికారులు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన తెలిపారు.