Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా అనుబంధ సంస్థల విక్రయం ద్వారా దాదాపు రూ.10,000 కోట్ల నిధులను సమీకరిం చాలని ప్రభుత్వ భావిస్తున్నట్టుగా సమాచారం. ఎయిరిండియాకు లాభాలను తెచ్చిపెడుతున్న గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఇంజినీరింగ్ విభాగంతో పాటుగా ప్రాంతీయ విమాన సేవలను అందిస్తున్న అలయన్స్ ఎయిర్తో పాటు ముంబయిలోని ఎయిరిండియా భవనాల విక్రయం ద్వారా దాదాపు రూ.14,000 కోట్ల వరకు నిధులను సమకూర్చుకోవాలని సర్కారు భావిస్తున్నట్టుగా సమాచారం. దీనిపై ప్రభుత్వంలోని ఒక సీనియర్ అధికారి వివరణనిస్తూ ఎయిరిండియా లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా దాదాపు రూ.పది వేల కోట్ల నిధులను సమకూర్చుకొని సంస్థ రుణభారాన్ని తగ్గించాలన్నది సర్కారు యోచన అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎయిరిండియాలో సర్కారు రుణవాటా రూ.29000 కోట్ల వరకు ఉంది. గత ఏడాది ఎయిరిండియాలో దాదాపు 76% వాటాను విక్రయించాలని భావించి తమ రుణాలను వెనక్కి తెచ్చుకోవాలని సర్కారు ప్లాన్ చేసినప్పటికీ సంస్థ కొనుగోలుకు ఎవ్వరూ ముందుకు రాని నేప థ్యంలో సర్కారు ప్రయత్నాలు బెడిసి కోట్టాయి. ఈ నేపథ్యంలో సర్కారు ఎయిరిండియాకు ఆత్మగా ఉంటూ లాభాలను ఆర్జిస్తున్న వివిధ అనుబంధ వ్యాపారాలను విక్రయించాలని నిర్ణయించడం విశే షం. అయితే ఎయిరిండియాకు లాభాల గనిగా ఉంటూ వస్తున్న ఈ అనుబంధ సంస్థలను విక్రయిం చాలన్న నిర్ణయం పట్ల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.