Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7శాతం పతనమైన సంస్థ షేర్లు
ముంబయి: తక్కువ ధరలకు విమానయానాన్ని అందించే దేశీ అతిపెద్ద ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో యాజమాన్యంలో ముసలం పుట్టింది. సంస్థ సహ వ్యవస్థాపకులై రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య ఆధిపత్య పోరుపై మార్కెట్ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. విస్తరణ వ్యూహాలు, వాటాదారుల ఒప్పందం అంశాలపై ప్రమోటర్లిద్దరి మధ్యా తీవ్ర విభేదాల పొడసూపాయని సమాచారం. నిర్వహణ, నియంత్రణకు సంబంధించిన అంశంతోపాటు షేర్ హోల్డర్స్ ఒప్పందంలో కొన్ని క్లాజెస్ విషయంలో వీరిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయని తెలుస్తోంది.ప్రధానంగా గత ఏడాది కంపెనీ సీఈవోగా ఆదిత్య ఘోష్ నియామకం తర్వాత నుంచి వీరి మధ్య వ్యవహారం చెడినట్టు సమాచారం. కీలక ఎగ్జిక్యూటివ్ల నియామకాలతోపాటు నిర్వహణ స్థానాల్లోని ప్రవాస భారతీయుల నియామకాలపై కూడా ఇద్దరి మధ్య విభేదాలున్నాయని తెలుస్తోంది. వార్తలపై ఇండిగో ఫౌండర్లు రాహుల్, గంగ్వాల్ అధికారికంగా ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ వార్తలతో గురువారంనాటి మార్కెట్లో ఇండిగో షేరు 7శాతం పతనమైంది. ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ మూసివేసిన తరువాత ఇబ్బందుల్లో ఉన్న భారతీయ వైమానిక రంగానికి భారత్లో అతిపెద్ద ఎయిర్లైన్ మార్కెట్ కలిగిన ఇండిగో సంక్షోభం ప్రమాదకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.