Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వరుసగా మూడు సెషన్లలో పెరిగిన రూపాయి విలువ శుక్రవారం డాలర్తో 21 పైసలు పడి పోయి 70.23 వద్ద ముగి సింది. ముడి చమురు ధరలు పెరగడం, గత కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత నిధులు తరలిపోవడం రూపాయి విలువను ఒత్తిడికి గురి చేశాయి. వారాంతంన ఉదయం 70.22 వద్ద ప్రారంభమైన రూపీ విలువ ఇంట్రా ట్రేడింగ్లో ఓ దశలో 70.32 కనిష్ట స్థాయికి పడిపోయింది. గురువారం సెషన్ ముగింపు నాటికి డాలర్తో రూపాయి విలువ 70.03 వద్ద నమోదయ్యింది. ఈ వారంలో రూపాయి విలువ మొత్తంగా 31 పైసలు క్షీణించింది. దీంతో వరుసగా రెండో వారంలోనూ విలువ కోల్పోయినట్లయ్యింది.