Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద ముడి ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు ఎన్ఎండీసీ భౌగోళికంగా, అంతర్జాతీయంగా విస్తరించడానికి కొత్తగా 'ఎన్ఎండీసీ గ్లోబల్' శాఖను ప్రారంభించింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ ప్రభుత్వ రంగ సంస్థ ప్రస్తుతం ఆస్ట్రేలియా, మోజాంబిక్, టంజానియా దేశాల్లో వ్యాపారాలు కలిగి ఉంది. మరిన్ని అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎన్ఎండీసీ గ్లోబల్ను ఏర్పాటు చేసినట్టు ఆ కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తు ఎత్తుగడల్లో భాగంగా సహజ వనరుల ఆస్తుల స్వాధీనం, వర్థమాన టెక్నాలజీ సంస్థలతో ఒప్పందం తదితర వాటి కోసం ఈ శాఖ పని చేయనుందని తెలిపింది. 2018-19లో ఎన్ఎండీసీి 32.38 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని విక్రయించింది. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరంలో ఇది 32.44 మిలియన్ టన్నులుగా ఉంది. మంగళవారం బీఎస్ఈలో ఎన్ఎండీసీి షేర్ 3.12 శాతం తగ్గి రూ.93.20 వద్ద ముగిసింది.