Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్అండ్టీ గ్రూపు చైర్మెన్ వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే ఐదేండ్లలో లర్సన్ అండ్ టర్బో మార్కెట్ కాపిటలైజేషన్ విలువ రూ.3 లక్షల కోట్లకు, కంపెనీ రెవెన్యూ రూ.2 లక్షల కోట్లకు చేరనుందని ఆ గ్రూపు చైర్మెన్ ఎఎం నాయక్ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ మధ్య కాలంలో కంపెనీ ఆవిష్కరించిన ఎల్అండ్టీ ఎన్ఎక్స్్టీ టెక్నాలజీ వేదిక ఇందుకు మద్దతు చేయనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 20 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఎల్అండ్టీ గ్రూపు మార్కెట్ కాపిటలైజేషన్ రూ.2.5 లక్షల కోట్లుగా, రెవెన్యూ రూ.1.4 లక్షల కోట్లుగా ఉందన్నారు. 1965లో ఎల్అండ్టీలో చేరిన నాయక్ 1999లో సీఈఓ బాధ్యతలు చేపట్టారు. 2003లో చైర్మెన్గా నియమితులయ్యారు. 2017లో గ్రూపు చైర్మెన్గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కంపెనీ ప్రధానంగా టెక్నాలజీ, ఇంజనీరింగ్, మౌలికవసతులు, తయారీ, విత్త రంగాల్లో బహుముఖ సేవల వ్యాపారాలు కలిగి ఉంది.