Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో ప్రీమియం మోటార్సైకిల్స్కు డిమాండ్ గణనీయంగా పెరుగుతూ వస్తోందని టీవీఎస్ మోటార్ కంపెనీ పీఎం మార్కెటింగ్ విభాగం అధినేత మేఘశ్యామ్ లక్ష్మణ్ డిగోల్ అన్నారు. బుధవారం ఆయన టీవీఎస్ సంస్థ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన 2019 మోడల్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310ను తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి ఆవిష్కరించారు. రేసింగ్ బైక్ల మాదిరిగా దీనిని స్లిప్పర్ క్లచ్తో రూపొందించినట్టుగా ఆయన తెలిపారు. మలుపుల వద్ద వాహనం పట్టుతప్పకుండా ఉండేందుకు దృఢంగా ముందుకు సాగేందుకు ఈ కొత్త క్లచ్ విధానం ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. స్లిప్పర్ క్లచ్వల్ల వాహనంలో ఇంధన పొదుపుతో పాటు నిర్వహణ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో దేశంలో యువత ఎక్కువగా ప్రీమియం మోటార్సైకిళ్ల వైపు దృష్టి పెడుతున్నారని.. ఈ నేపథ్యంలో కొత్త ఉత్పత్తులతో మార్కెట్లో మేటిగా నిలిచేందుకు గాను తాము కొత్తకొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నట్టుగా ఆయన వివరించారు. తెలంగాణలో కొత్తబైక్ ధరను కంపెనీ రూ.2.20 లక్షలుగా నిర్ణయించిందని ఆయన తెలిపారు. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 వాహనం ఇన్క్లైన్డ్ డబుల్ ఓవర్హెడ్కామ్ లిక్వడ్ కూల్డ్ ఇంజిన్తో అందుబాటులోకి తెచ్చారు.