Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశాలకు వెళ్లకుండా సర్కారు ఆంక్షలు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రయివేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి.. మూతపడడం వెనుక ఆ సంస్థకు చెందిన పెద్ద తలకాయల పాత్ర ఉందన్న అనుమానాల నేపథ్యంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వివాదానికి సంబంధించి జెట్ ఎయిర్వేస్ సీఈవో వినోద్ దూబేపై కూడా ప్రభుత్వం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. ఆర్థిక నేరాలకు సంబంధించిన దర్యాప్తు జరుగుతుండటంతో ఆయన విదేశాలకు వెళ్లకుండా నిలవరించాలని, అందుకు తగిన అన్ని చర్యలు చేపట్టాలని ఆ నోటీసులో పేర్కొంది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఈ నోటీసును జారీ చేసింది. దూబే ఇప్పటికే జెట్ ఎయిర్వేస్లో పదవికి రాజీనామా చేశారు. ఆయన మే14న తన రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గత నెలలో జెట్ చైర్మెన్ నరేశ్ గోయెల్ ఆయన సతీమణి లండన్ వెళ్లేందుకు సమాయత్తం అవుతుండగా ఇమిగ్రేషన్ ఆధికారులు లుక్ అవుట్ నోటీసులను సాకుగా చూపుతూ వారి ప్రయాణాన్ని అడ్డుకున్న సంగతి తెలిపింది. గతంలో నరేష్ గోయల్పై జారీ చేసినట్లుగానే తాజాగా దుబేకు కూడా నోటీసులు జారీ చేయడం విశేషం. కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి ఇటీవల మొత్తం 20 మందిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. వీరిలో దూబే కూడా ఒకరు. మిగిలిన వారు తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ''వారి వేసవి పర్యటలను ఆపేయండి'' అని దర్యాప్తు సంస్థలకు నోటీసులు వెళ్లాయి. నిర్వహణ నగదు లేని కారణంగా జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17 నుంచి తన కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. మరోపక్క ఈ సంస్థలకు రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని రుణదాతలు తమ సొమ్ము వసూలు చేసుకోవడానికి ప్రయత్నాలను మూమ్మరం చేస్తున్నారు. త్వరలోనే కీలక వాటా కొనుగోలుకు సరైన సంస్థను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.