Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నుంచి వేలాది కోట్ల రూపాయల రుణాలను అక్రమంగా పొంది విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ చుట్టు చట్టపరంగా ఉచ్చు బిగించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పక్కాగా సన్నద్ధమైంది. చోక్సీ మోసానికి సంబంధించిన అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచుతూ ఉద్దేక పూర్వక రుణ ఎగవేతదారుడు, ఆర్థిక నేరస్తుడు, తప్పించుకుని పారిపోయినాడు ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం బాంబే హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో తాను అమాయకుడినంటూ చోక్సీ దాఖలు చేసిన రెండు పిటిషన్లను తిరస్కరించాల్సిందిగా ఈడీ కోరింది. ఈ మేరకు ఈడీ రెండు పిటిషన్లను దాఖలు చేసింది. మొదటి అఫిడవిట్లో చోక్సిని ఫ్యుజిటివ్ ఆర్థికనేరస్తుడిగా ప్రకటించాలని ఈడీ కోరింది. రెండవ అఫిడవిట్లో అతనిని కేసు విచారణ నిమిత్తం ప్రశ్నించేందుకు అనుమతినివ్వాలని కోరింది. న్యాయస్థానం నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ కోర్టుముందు హాజరు కాకుండా ఉద్దేశ పూర్వకంగా తప్పించుకు తిరుగుతున్నాడంటూ జస్టిస్ మహంతి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం సమర్పించిన అఫిడవిట్లో ఈడీ ఆరోపించింది. విచారణకు సహకరించే ఉద్దేశం అతనికి లేదని మండిపడింది. వాదనలు విన్న ధర్మాసనం మంగళవారం ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను చేపట్టనుంది.