Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లోకి ఏప్రిలియో స్ట్రోమ్-125
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ వాహన తయారీ దిగ్గజ సంస్థ పియా జియో గ్రూపు మంగళ వారం రెండు సరి కొత్త స్కూటర్లను మార్కె ట్లోకి ఆవి ష్కరించింది. ఏప్రిలియా స్ట్రామ్-125, వెస్పా అర్బన్ క్లబ్ వేరియంట్ స్కూటర్ను సంస్థ హైదరబాద్ వేదికగా మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ టూవీలర్స్ బిజినెస్ హెడ్ అశీష్ యక్మీ ఈ కొత్త వాహనాలను మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిలియా స్కూటర్లను విప్లవాత్మక సాంకేతికతతో తీర్చిదిద్దామన్నారు. ఈ వాహనం ధరను రూ.65,000గా (ఎక్స్షోరూమ్, హైదరాబాద్) కంపెనీ నిర్ణయించింది. ఏప్రిలియా ఎస్ఆర్125తో పోలిస్తే దీని ధర దాదాపు రూ.8000 తక్కువ. 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్లు, 124.9 సీసీ ఎయిర్కూల్డ్ సింగిల్ సిలిండర్ మోటర్, సీవీడీ ట్రాన్స్మిషన్, డ్రమ్ బ్రేక్స్, 6.5 లీటర్ల ట్యాంకు సామర్థ్య ంతో అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. మరోవైపు ఆధునిక పీచర్లతో వెస్పా అర్బన్ క్లబ్ వేరియంట్ వాహనాన్ని తాము మార్కెట్లోకి విడుదల చేశారు. దీని ధరను కంపెనీ రూ.72,774గా (ఎక్స్షోరూమ్, హైదరాబాద్) కంపెనీ నిర్ణయించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పియాజియో సంస్థ వెస్పా, ఏప్రిలియా బ్రాండ్ల తో మార్కెట్లో వాహనాలను విక్రయిస్తోందని తెలిపారు. గత రెండేళ్లలో తమ కంపెనీ అమ్మకాల్లో 32 శాతం వృద్ధిని నమోదు చేస్తూ వస్తోందని తెలిపారు. తమ వాహనాలు అందుబాటులో ఉన్న 125, 150 సీసీ విభాగాల్లో పియాజియో సంస్థ 10-15 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 25 పైగా డీలర్షిప్లు కలిగి ఉన్నామన్నారు. వచ్చే నాలుగైదు నెలల్లోనే మరో 20 డీలర్షిప్లను కొత్తగా అందుబాటులోకి తేనున్నట్టుగా ఆయన వివరించారు.