Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: గూగుల్ సీఈవో సుందర్ పిచారుకి అరుదైన గౌరవం దక్కింది. అమెరికా భారత వాణిజ్య మండలి (యూఎస్ఐబీసీ) ప్రతి ఏటా ఇచ్చే 'గ్లోబల్ లీడర్షిప్ అవార్డు'ను 2019కి సుందర్ పిచారు ఎంపికయ్యారు. పిచారుతో పాటు నాస్డాక్ సీఈవో అడేనా ఫ్రైడ్మాన్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచ సాంకేతిక రంగ అబివృద్ధికి గాను గూగుల్, నాస్డాక్ కంపెనీలు అందిస్తున్న సేవలకు గానూ వారిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు మండలి పేర్కొంది. 2007 నుంచి ఇస్తున్న ఈ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు.. ఇరు దేశాల వాణిజ్య బంధం బలోపేతానికి సహకరిస్తున్న కార్పొరేట్ కంపెనీల దిగ్గజాలకు ప్రదానం చేస్తూ వస్తున్నారు.