Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తనయుడు రిషద్ ప్రేమ్జీకి చైర్మెన్గా బాధ్యతలు
బెంగళూరు: సాఫ్ట్వేర్ సేవల సంస్థ విప్రో ఫౌండర్, చైర్మెన్్ అజీం ప్రేమ్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. జులై చివరి నుంచి విప్రో చైర్మెన్ ఆయన బాధ్యతలనుంచి విశ్రాంతి తీసుకోనున్నారని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. రిటైర్మెంట్ తర్వాత కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, వ్యవస్థాపక చైర్మెన్ హోదాలో ఆయన కొనసాగనున్నారు. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మెన్్గా 53 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కంపెనీలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా, బోర్డు మెంబర్గా ఉన్న ప్రేమ్జీ తనయుడు రిషద్ ప్రేమ్జీ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్్గా నియమితులు కానున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న అబిదాలీ జడ్ నీముచ్వాలా ఇకపై సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగనున్నారు. జులై 31 నుంచి ఈ నియామకాలు అమల్లోకి రానున్నాయని, ఈ మేరకు వాటాదారుల ఆమోదం లభించిందని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. ''ఇది నాకు చాలా సుదీర్ఘమైన, సంతృప్తికరమైన ప్రయాణం. భవిష్యత్తులో దాతృత్వపు కార్యక్రమాలపై మరింతగా దృష్టి కేంద్రీకరించడంతో పాటు ఈ దిశగా ఎక్కువ సమయాన్ని కేటాయించాలని ప్రణాళిక వేసుకున్నా'' అని అజీం ప్రేమ్జీ ఒక ప్రకటనలో తెలిపారు.