Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ అధునాత ఫీచర్లతో సరికొత్త ల్యాప్టాప్ను మార్కెట్లోకి విడుదల చేసింది. లాటిట్యూడ్ 7000 సిరీస్లో భాగంగా 14 అంగుళాల 2 ఇన్ వన్ ల్యాప్టాప్ను 'డెల్ లాటిట్యూడ్-7400' పేరుతో దీనిని మార్కెట్లోకి శుక్రవారం ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధరను సంస్థ రూ.1,35,000గా నిర్ణయించింది. ఇంటెల్ కంటెక్ట్స్ టెక్నాలజీ ఆధారిత సెన్సర్, ఎక్స్ప్రెస్ చార్జింగ్, ఎక్స్ప్రెస్ కనెక్ట్లాంటి ఫీచర్లతో ఈ ల్యాప్టాప్ యూజర్లకు బెస్ట్ అనుభవాన్ని ఇస్తుందనీ, ఎలాంటి అంతరాయం లేకుండా వేగవంతమైన, సర్వీసులను అందిస్తుందని డెల్ ప్రకటించింది. స్లీప్మోడ్లో ఉన్న ల్యాప్టాప్ యూజర్ ఉనికిని గుర్తించి విండోస్ హలో (బయోమెట్రిక్ యాక్సెస్)కు లాగిన్ అవుతుందని కంపెనీ తెలిపింది. లేదంటే ఆటోమేటిక్గా లాక్ అవుతుందని వివరించింది. తద్వారా సెక్యూరిటీతో బ్యాటరీ పొదుపు అవుతుందని కంపెనీ చెబుతోంది. ఫింగర్ ప్రింట్ రీడర్, పవర్ బటన్ లాంటి ఇన్నోవేటివ్ ఫీచర్లతో వ్యాపార సంస్థలకు ఉపయుక్తంగా ఉండేలా దీనిని తీర్చిదిద్దామని డెల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ఇంద్రజిత్ బెలగుండి చెప్పారు. తొందరలోనే ఆన్లైన్, రీటైల్ స్టోర్లలో ఈ ల్యాప్టాప్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.