Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. దేశీయ, అంతర్జాతీయ అనుకూలతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలలో కదలాడాయి. ఐటీ షేర్ల జోరుతో సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 39,785 పాయింట్ల వద్ద ముగసింది. ఇక నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 11,923 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే 350 పాయింట్లకు పైగా ర్యాలీ చేసిన బెంచ్మార్క్ సూచీలు చివరి వరకు అదే లాభాలను కొనసాగించ లేకపోయాయి. అమ్మకాలు పెరగడంతో ముగింపులో లాభాలు తగ్గాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇందుకు కారణం. నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఎక్కువగా (1.53 శాతం) నష్టపోయింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్లు బాగా ర్యాలీ చేశాయి. 1 శాతానికి పైగా పెరిగాయి. జెట్ ఎయిర్వేస్ షేర్లు 8 శాతం పడిపోయాయి. ఈ సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చే ప్రణాళిక మరింత జాప్యం కానుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ షేర్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ విభాగాల పరంగా చూస్తే ఐటీ, ఎఫ్ఎంసీజీ సూచీలు 1శాతంపైగా లాభపడగా.. మీడియా, పీఎస్యూ బ్యాంక్ల సూచీలు 2శాతం వరకు నష్టపోయాయి. జమ్ము కాశ్మీర్ బ్యాంక్ షేర్లు దాదాపు 20శాతం కుంగాయి. ఆ బ్యాంక్ మాజీ సీఎండీ అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో షేర్లు పతనమయ్యాయి. ఈ సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చే ప్రణాళిక మరింత జాప్యం కానుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. వరుసగా ఆరుట్రేడింగ్ సెషన్ల నుంచి ఈ షేరు పతనమవుతోంది. ఇక అడాగ్ గ్రూప్నకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆర్పవర్ 20శాతం పతనమై రూ.4.94 స్థాయిని తాకింది. ఈ కంపెనీ మార్చి త్రైమాసికానికి రూ.3,559 కోట్ల నష్టాన్ని ప్రకటించడంతో మార్కెట్ ఈ విధంగా స్పందించింది. ఏడాది క్రితం ఈ కంపెనీ రూ.189 కోట్ల లాభాన్ని ప్రకటించింది.