Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా విధానాన్ని భారత్ అమలు చేయాలి
- ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పారు
బెంగళూరు : భారత దేశంలో ఉద్యోగాల సమస్య లేదని, వేతనాలే తక్కువగా ఉంటున్నాయని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ, పెట్టుబడిదారు టీ వీ మోహన్ దాస్ పారు చెప్పారు. తక్కువ వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఇటువంటి ఉద్యోగాలను డిగ్రీ హౌల్డర్లు ఇష్టపడటం లేదన్నారు. భారతదేశం లో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నెలసరి వేతనం వచ్చే ఉద్యోగాలు మాత్రమే ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఇవి డిగ్రీ హౌల్డర్లకు ఆకర్షణీయంగా లేవని తెలిపారు. మెరుగైన ఉద్యోగాల సృష్టి జరగడం లేదని చెప్పారు. భారత దేశానికి వేతనాల సమస్యే ఉన్నదనీ, ఉద్యోగాల సమస్య లేదని వివరించారు.
చైనా విధానాన్ని మన దేశం కూడా అమలు చేయాలని సూచించారు. చైనా మొదట కార్మికులు ఎక్కువగా అవసరమైన పరిశ్రమలను ప్రారంభించిందన్నారు. తమ కార్మికులను ఉపయోగించుకోవాలని మిగిలిన దేశాలను కోరిందని చెప్పారు. ఆ తర్వాత ఎగుమతులను ప్రారంభించిందని వివరించారు.. కార్మికులు ఎక్కువగా అవసరమైన పరిశ్రమలను కేంద్రం ప్రోత్సహించడం లేదన్నారు. మన దేశంలో సరైన విధానాలు లేవనీ, అందువల్ల మిగులు కార్మిక శక్తిని కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని తెలిపారు.