Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 491 పాయింట్ల పతనం
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లను మరోమారు వాణిజ్య యుద్ధ భయాలు కుదేల్ చేశాయి. దీనికి తోడు దేశీయంగా నెలకొన్న బలహీనత పరిస్థితులు సోమవారం సెన్సెక్స్ 39వేల దిగువన పడేశాయి. తుదకు సెన్సెక్స్ ఏకంగా 491 పాయింట్లు కోల్పోయి 38,960.79 వద్ద ముగిసింది. నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 11,672.15కు పడిపోయింది. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, తీవ్రతరమవుతున్న వాణిజ్య యుద్ధ ఆందోళనలు, పెరిగిన ముడి చమురు ధరలు, ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, డాలర్తో రూపాయి మారకం విలువ బలహీనంగా ట్రేడింగ్ కావడం, జూన్ 18 నుంచి జరగునున్న ఫెడ్ రిజర్వ్ సమీక్షా సమావేశాల నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. నైరుతి రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందనే అందోళనలు కూడా మార్కెట్ ప్రతికూలాంశంగా మారింది. అన్ని రంగాలకు చెందిన షేర్లు తీవ్రంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలుపడటం తదితర అంశాలు భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.