Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బొలెరో పికప్ శ్రేణి వాహనాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెటింగ్ ఆటోమోటివ్ డివిజన్ విభాగం ఉపాధ్యక్షుడు విక్రమ్ గార్గా అన్నారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తాము 1.62 లక్షల బొలెరో పికప్ వాహనాలను విక్రయించామని ఆయన తెలిపారు. అంతకు ముందు ఏడాది వీటి అమ్మకాలు 1.49 లక్షలకు మాత్రమే పరిమితమైందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వాహన అమ్మకాలలో 10 నుంచి 12 వృద్ధిని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ కొత్తగా తయారు చేసిన బొలెరో క్యాంపర్ గోల్డ్ జెడ్ఎక్స్ వాహనాన్ని ఆయన బుధవారం తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా గార్గా మాట్లాడుతూకొత్త తరహా వాహనాన్ని దాదాపు 1000 కిలోల లోడ్ను తీసుకుపోయేలా తయారు చేశామన్నారు. బొలెరో క్యాంపర్ వాహన శ్రేణికి చెందిన అన్ని మోడల్ బొలెరోలను తాము తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంటులోనే తయారు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మార్కెట్ అవసరాలను బట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే యోచన చేస్తున్నట్టుగా ఆయన వివరించారు. మహీంద్రా సంస్థకు తలమానికమైన బ్రాండ్గా పేరున్న బొలెరో పికప్ వాహనాల విభాగంలో 86 శాతం వాటాను కలిగి ఉందని ఆయన తెలిపారు.