Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత్లో మాడ్యులర్ ఇంటీరియర్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని ప్రముఖ హోమ్ డిజైన్ సొల్యూషన్స్ సంస్థ హోమ్లేన్ సీఈవో శ్రీకాంత్ అయ్యర్ అన్నారు. ఈ ఏడాది ఇంటీరియర్ మార్కెట్ విలువ దాదాపు 1500 కోట్లకు చేరుకొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. సంస్థ రెండో ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1000 చ.అ. విస్తీర్ణం కలిగిన ఒక్కో డబుల్ బెడ్రూమ్ ప్లాట్ హోమ్ డిజన్ కోసం దాదాపు రూ.4 నుంచి రూ.5 లక్ష వరకు ఖర్చవుతుందనిఅన్నారు. అయితే తమ సంస్థ ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి, ఎన్సీఆర్, కోల్కతాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో తమ సంస్థ దాదాపు 50 టెక్నికల్ టీమ్స్తో కార్యకలాపాలను అందిస్తోందని తెలిపారు. రోజుకు రెండు ఇండ్లకు ఇంటీరియర్ను చేసే సామర్థ్యం కలిగి ఉన్నామని రానున్న రోజుల్లో దీనిని మరింత విస్తరించనున్నట్టుగా హైదరాబాద్ విభాగం బిజినెస్ హెడ్ స్విప్నిల్ చాన్నాహర్ తెలిపారు.