Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్లో మేటి టెక్నాలజీని అందించే సంస్థలు, టెక్నీషియన్లు అందుబాటులో ఉన్నం దున పలు సంస్థలు తమ విస్తరణకు ఈ నగరంపై దృష్టి సారిస్తున్నారని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ చీఫ్ డేటా, టెక్నాలజీ ఆఫీసర్ నిక్ కఫెరిలియో అన్నారు. సంస్థ హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఒరియన్ ఆఫీసును ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ అండ్ పీ సంస్థ 2004లో కేవలం 200 మంది ఉద్యోగులతో తమ కార్యకలాపాలను ప్రారంభించిందని అన్నారు. ప్రస్తుతం భారత్లో పని చేస్తున్న వారి సంఖ్య 7500కు చేరిందన్నారు. ఎస్ అండ్ పీ భారత విభాగం కార్యకలాపాల డైరెక్టర్ అభిషేక్ తిమోర్ మాట్లాడతూ అంతర్జాతీయంగా ఎస్ అండ్ పీ కార్యకాలాపాలను అనుసంధానం చేస్తూ తాము హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరిస్తున్నామని ఆయన తెలిపారు. 2017లో తాము నెస్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఒరియన్ టెక్నాలజీ కేంద్రాన్ని కో బ్రాండెడ్ ఫెసిలిటీగా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇందులో 850 మంది సిబ్బంది ఉన్నారని ఆయన వివరించారు. ఇప్పుడు నెస్ను ఎస్ అండ్ పీ గ్లోబల్లో విలీనం చేస్తున్నందున ఇకపై ఆ ఉద్యోగులను సంస్థలోకి విలీనం చేసుకుంటున్నామన్నారు.