Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో ధరల మంట మండుతున్నప్పటికీ టోకు ధరల ద్రవోల్బణం (డబ్ల్యూపీఐ) 23 నెలల కనిష్టానికి దిగివచ్చినట్టుగా సర్కారు సోమవారం వెల్లడించింది. ఆహార పదార్థాలు, ఇంధనం, విద్యుత్ ధరలు తగ్గడంతో జూన్ నెలలో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 23 నెలల కనిష్ఠానికి దిగొచ్చింది. క్రితం నెలలో డబ్ల్యూపీఐ 2.02శాతంగా నమోదైంది. 2017 జులై (1.88శాతం) తర్వాత ఇదే కనిష్ఠం కావడం విశేషం. ఇదిలా ఉండగా.. మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 2.45 శాతంగా నమోదైంది. 2018 జూన్లో ఇది 5.68శాతంగా ఉంది. సోమవారం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. జూన్లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.98శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు తగ్గడంతో ఆ విభాగ ద్రవ్యోల్బణం 24.76శాతానికి పడిపోయింది. మే నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 33.15శాతంగా నమోదైంది. అయితే ఉల్లిధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇంధనం, విద్యుత్ విభాగ ద్రవ్యోల్బణం 0.98శాతం నుంచి -2.20శాతానికి పరిమితమైంది.