Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్ గురువారం ఏ-సిరీస్లో ఖరీదైన స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ-ఏ80 పేరుతో దీనిని సంస్థ మార్కెట్లోకి తెచ్చింది. పూర్తి అత్యాధునిక సౌకర్యాల కూర్పుతో తయారు చేసిన ఈ ఫోన్ ధరను సంస్థ రూ.47,990గా నిర్ణయించింది. మూడు అత్యాధునిక కెమేరాలతో శాంసంగ్ ఈ ఫోన్ను తయారు చేసింది. 48 ఎంపీ ప్రైమరి సెన్సార్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్తో రెండో కెమెరా, ఐఆర్ సెన్సార్తో 3డీ డెప్త్ కెమెరాతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మూడు కెమెరాలను అవసరాన్ని బట్టి ముందుకు, వెనక్కి తిప్పుకొనేలా (రొటేట్ చేసుకునేలా) ఈ ఫోన్లో ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు 6.7 అంగుళాల పంచ్ హోల్ ఎఫ్హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ తెర, క్వాల్కామ్ గేమింగ్ ఆధారిత 730జీ సిస్టమ్ చిప్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత స్టోరేజీ, 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జర్తో సంస్థ ఈ ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది.