Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శనివారం మార్కెట్ వర్గాలను మెప్పించే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో సంస్థ ఏకీకృత నికర లాభంలో 18.04 శాతం మేర పెరిగి.. రూ.5,676.06 కోట్లకు చేరినట్టుగా బ్యాంక్ తెలిపింది. ప్రధాన వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటుగా మొండి బాకీలను తగ్గించుకోవడం వల్లే బ్యాంక్ మెరుగైన ఆర్థిక ఫలితాలను అందుకోగలిగిందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో బ్యాంక్ నికర లాభం రూ.4,808.35 కోట్లుగా నిలిచింది. ఇదే సమయంలో బ్యాంక్ ఆదాయం రూ.28,000.06 కోట్ల నుంచి రూ.34,324.45 కోట్లకు పెరిగినట్టుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. ఇదే సమయంలో సంస్థ వడ్డీ ఆదాయం రూ.23,978.67 కోట్లకు చేరినట్టుగా బ్యాంక్ వివరించింది.