Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పన్ను ఆదాయం తగ్గడమే కారణం
- పీఎం ఆర్థిక సలహా మండలి సభ్యుడు రారు
న్యూఢిల్లీ: భారత్ నిశ్శబ్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు రతిన్ రాయ్ అన్నారు. పన్ను ఆదాయాల్లో కొరత కారణంగా దేశంలో నిశ్శబ్ద ఆర్థిక సంక్షోభ పరిస్థితులు చుట్టుముడుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఇటీవలి బడ్జెట్లో ప్రభుత్వం ఈ సమస్యను స్థూలంగా తక్కువ చేసి చూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. పన్ను ఆదాయాల్లో కొరత నివారణకు బడ్జెట్లో ప్రభుత్వ చేసిన ప్రతిపాదనలు.. విత్త లోటు సమస్యకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయి సమాధానం అందించలేకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ బడ్జెట్ లోటు జీడీపీలో 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. బలహీనమైన ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనను కల్పించాల్సిన ఆవశ్యకత బలంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా.. ఆర్థిక మంత్రి బడ్జెట్ లోటు అంచనాలను తగ్గించడాన్ని రాయ్ ఆక్షేపించారు. ద్రవ్యలోటను పూడ్చేందుకు గాను వివిధ రకాల పన్నులను పెంచడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం, సర్కారు బ్యాంకుల నుంచి మరింత గరిష్టంగా డివిడెండ్ను కోరడం వంటి చర్యలను మంత్రి నిర్మల బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఇవి ఆచరణలో అంత సులువు కాదని రాయ్ అభిప్రాయపడ్డారు. భారతలో నెలకొన్న నిశ్శబ్ద ఆర్థిక సంక్షోభం ప్రధాన కేంద్రం పన్ను ఆదాయం తగ్గడంలోనే ఉందని రారు వివరించారు. జీఎస్టీ, ఆదాయపు పన్ను రాక తగ్గుముఖం పట్టడంతో సవరించిన అంచనాల కంటే కూడా ఖజానాకు ఆదాయం తగ్గుతూ వస్తోందని ఆయన అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి డైరెక్టర్ కూడా అయిన రాయ్ ఈ విషయమై మరింత వివరణనిస్తూ బడ్జెట్ పత్రం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.25.5 లక్షల కోట్ల సొమ్మును పన్నుల రూపంలో సముపార్జించవచ్చని సర్కారు అంచనా కట్టిందనిఅన్నారు. ఇదే సమయంలో ఆర్థిక శాఖ వెలువరించిన ఆర్థిక సర్వే ప్రకారం ఈ ఏడాదికి పన్ను ఆదాయం రూ.20.8 లక్షల కోట్ల దరిదాపులకే పరిమితం అయ్యే అవకాశం ఉందని సర్కారు వెల్లడించిందని ఆయన తెలిపారు. దీంతో లక్ష్యం నెరవేరకపోవచ్చని ఆయన వివరించారు. అంతకు ముందు మార్చితో ముగిసిన ఏడాదిలో కూడా కేంద్రం రూ.22.5 లక్షల కోట్ల పన్ను ఆదాయాన్ని ఆర్జించండంలో విఫలమైన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.