Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో ప్రకటన వెలువడే అవకాశం..
న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనంగా దూసుకువచ్చిన రిలయన్స్ జియో.. వచ్చే నెల నుంచి దేశ వ్యాప్తంగా జియో గిగా ఫైబర్ పేరుతో బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమా చారం. ఇప్పటికే ప్రయోగాత్మక దశలో ఉన్న జియో బ్రాడ్ బ్యాండ్ సేవలను.. రిలయన్స్ సంస్థ ఆగస్టు 12 నుంచి అధికారికంగా దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) సందర్భంగా అధికారికంగా ప్రారంభించనుందని అంచనా. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. 'ఫైబర్-టు-ది-హోం' (ఎఫ్టీటీహెచ్) సేవలను అధికారికంగా ప్రారంభించే విషయమై వచ్చే నెలలో జరగనున్న సాధారణ సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ ఇండిస్టీస్ ప్రకటించే అవకాశం ఉంది' అని ఇంగ్లీష్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న జియో ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే బ్రాడ్ బ్యాండ్తో పాటు, ల్యాండ్లైన్ సౌకర్యం కూడా అందించనున్నారు. దీనికి సమాంతరంగా డీటీహెచ్ టీవీ సేవలను సైతం ప్రారంభించనుంది. 100 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ వరకూ 90 రోజుల పాటు ఉచిత సేవలను అందించేలా రిలయన్స్ సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.