Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ విత్తన తయారీ సంస్థ కావేరీ సీడ్స్ జూన్తో ముగిసిన తొలి త్రైమాసికానికి రూ.228.93 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయం ఆర్థిక ఫలితాలతో పోలిస్తే ఇది 8.72 శాతం అధికమని సంస్థ తెలిపింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో సంస్థ అమ్మకాలు రూ.581.89 కోట్ల నుంచి రూ.655.46 కోట్లకు చేరుకున్నాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.కంపెనీ నిర్వహణ ఎబిడ్టా 68 బేసిస్ పాయింట్లుగా నిలిచింది. గత ఏడాది ఇతర విభాగాల నుంచి అందిన ఆదాయంతో పోలిస్తే ఏప్రిల్-.జూన్ మధ్య కాలంలో అందిన ఆదాయం తక్కువగా నమోదు అయినట్టుగా కంపెనీ తెలిపింది.