Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థికం గా బాసటను అందించేందుకు ఓరి యం టల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) అన్ని వేళల ముందుంటుందని ఆ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్, హైదరాబాద్ సర్కి ల్ హెడ్ అరుణ్ అగర్వాల్ అన్నారు. శనివారం బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ కార్యాలయంలో ఎంఎస్ఎంఈ మీట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎం ఎస్ఎంఈ విభాగంలో ఇప్పటికే రుణాలు పొందిచన చిన్న తరహా పారిశ్రామికవేత్తలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరి శ్రమలను ఏర్పాటు చేయదలచిన వారికి బ్యాంక్ అందిస్తోన్న వివిధ ఉత్పత్తులను గురించి వివరణనిచ్చారు. బ్యాంక్ నుంచి రుణాలు స్వీకరించి వాటిని క్రమం తప్ప కుండా సకాలంలో చెల్లిస్తున్న వారిని ఈ సందర్భంగా సత్కరించారు. బ్యాంక్ నుంచి 59 నిమిషాల్లో ఎంఎస్ఎంఈ రుణ పథకం, ముద్రా రుణాలు పొంది వ్యాపారాభివృద్ధి చేసుకోవాలని ఆయన వినియోగదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ఎంఈ ప్రతినిధులు బ్యాంక్ చేపట్టిన ఎం ఎస్ఎంఈ కస్టమర్ మీట్ కార్యక్రమాన్ని ప్రశంసించారు.