Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు దిగువ స్థాయి నుంచి సంప్రదింపులు జరపాలన్న కేంద్ర ఆదేశాల మేరకు.. ఆంధ్రబ్యాంక్లోని (ఏబీ) హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ జోనల్ల పరిధిలో శనివారం కీలక క్షేత్రస్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో బ్యాంక్ ఎండీ, సీఈవో పకిరి స్వామి, హైదరాబాద్-1 జోనల్ మేనేజర్ కె.రాజేంద్ర కుమార్, జీఎం వేణు మాధవ్, హైదరాబాద్-2 జోనల్ మేనేజర్ ఎం.రాజేంద్ర కుమార్, జీఎం ఎల్.మల్లవధనులు, సికింద్రా బాద్ జోనల్ మేనేజర్ ధనుంజయ రావుతో పాటు మూడు జోన్ల అధికారులు పాల్గొన్నారు. బ్యాంక్ అభివృద్ధితో పాటుగా జాతీయ ప్రాధాన్యతలలో పాలుపంచుకొనే విషయంలో తమ శాఖల పనితీరును సమీక్షించుకునే దిశగా ఈ సమావేశాలు జరిగాయి. తొలి విడుత సమావేశాలు శనివారం ముగిశాయి. ఆదివారం ఆయాజోన్లలోని బ్రాంచీల అధికారులతో ఉన్నతాధికారులు మరోదఫా చర్చలు జరపనున్నారు.