Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యాంకింగ్ రంగం ముందున్న సమస్యలు.. వాటిని అధిగమిస్తూ భవిష్యత్తులో పురోగమించాల్సిన విధానాలపై ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (వోబీసీ) హైదరాబాద్ సర్కిల్ పరిధిలో క్షేత్రస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశానికి సర్కిల్ పరిధిలోని బ్యాంక్కు చెందిన అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్లో తీసుకోవాల్సిన సంస్కరణల అంచనాకు గాను ఈ సమావేశంలో పలువురు ప్రముఖుల అందించిన విషయ పత్రాలను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వీటికి తోడు క్షేత్రస్థాయిలో బ్యాంకింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈ వేదికపై సమీక్షించారు. వ్యవసాయ రుణాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారి ప్రయోజనాలను కాపాడుతూనే తద్వారా జాతీయ ప్రయోజనాలను అడ్డుకొనేందుకు తీసుకువాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ బ్రాంచీల సిబ్బంది పలు నిర్మాణాత్మక సలహాలను అందించారు. బ్యాంక్ అభివృద్ధికి గాను గరిష్ట టెక్నాలజీ వాడకం, సిటిజెన్ సెంట్రిక్ సేవల పెంపు గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు.