Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: క్షేత్రస్థాయిలో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి గాను అలహాబాద్ బ్యాంక్ నిర్వహించిన బ్రాంచీల స్థాయి అధికారుల సమాలోచన సదస్సు ఫలప్రదంగా ముగిసింది. హైదరాబాద్ జోనల్ కార్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఈ సదస్సులో జోన్ పరిధిలోని అన్ని బ్రాంచీలకు చెందిన బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు మెంటార్లుగా వ్యవహరించారు. కార్యమ్రంలో పాల్గొన్న బ్యాంక్ ఆధికారులు క్షేత్ర స్థాయిలో ఉత్సాహంగా పాల్గొని జాతీయ ప్రయోజనాలను పరిరక్షిస్తూనే బ్యాంకింగ్ వృద్ధికి తీసుకోవాల్సిన పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా అలహాబాద్ బ్యాంక్ ఉన్నధికారులు మాట్లాడుతూ బ్యాంక్ లక్ష్యాలను నెరవేర్చడంలో స్థానికేతర సమస్యలను అధిగమించడంపై అవగాహన కల్పించారు. వృద్ధికి అవకాశం ఉన్న విభాగాలపై దృష్టి సారించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశం వల్ల బ్యాంక్ అభివృద్ధికి ఉపయుక్తమైన ఎంతో సమాచారం లభించినట్టుగా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.ఎస్.భట్ ఒక ప్రకటనలో తెలిపారు.