Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారత్ ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు అవసరమైన పటిష్ట బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇండియన్ బ్యాంక్ బ్రాంచీల స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇండియన్ బ్యాంక్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బ్యాంక్కు చెందిన జోన్ పరిధిలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమాలోచనల సదస్సులో బ్యాంకు ఆర్థికంగా వృద్ధి చెందకుండా అవరోధంగా నిలుస్తున్న పలు అంశాలను గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు. వృద్ధికి గత అవకాశాలను అందిపుచ్చుకోవడం, ఖాతాదారుల అవసరాలు, డిజటైజేషన్ అభివృద్ధి వంటి పలు అంశాలపై చర్చ జరిగింది. దీనికి తోడు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, స్టార్టప్లకు, ముద్రా పథకం కింది ఆర్థిక తోడ్పాటు అందించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. రిటైల్ రుణాల జారీ, డిజిటల్ లావాదేవీల పెంపుపై కూడా చర్చ జరిగింది. క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకోంనేందుకు గాను ఈ సమావేశం ఎంతో ఉపకరించిందని.. రానున్న రోజుల్లో ఈ సదస్సులోని అంశాలను పరిగణనలోకి తీసుకొని వృద్ధి ప్రణాళికలను రూపొందించుకోనున్నట్టుగా బ్యాంక్ అధికారులు తెలిపారు.