Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు విస్తృతంగా రుణాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఉన్నతాధికారులు అన్నారు. కేంద్ర ఆర్థిక కార్యకలాపాల శాఖ ఆదేశాల మేరకు ఎస్బీఐ బ్యాంక్ కరీంనగర్ ప్రాంతీయ కార్యాలయంలో క్షేత్రస్థాయి అధికారుల సమాలోచనల సదస్సును నిర్వహించింది. బ్యాంక్ జనరల్ మేనేజర్ యు.ఎన్.ఎన్.మయా కార్యక్రమాన్ని ప్రారంభించి అధికారులకు తగిన దిశానిర్ధేశం చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థను సిటిజన్ సెంట్రిక్గా రూపొందించేందుకు గాను టెక్నాలజీ వాడకాన్ని పెంచడం, కొత్తకొత్త ఉత్పత్తులను తీసుకురావడంతో పాటు డేటా అనలిటిక్స్ వాడకాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తే మేలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంకులు వ్యాపార విస్తరణలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారు ముఖ్యంగా రైతులు, చిన్న పరిశ్రమల వారు, వ్యాపారవేత్తలు, యువత, విద్యార్థులు, మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించే విషయంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన లభించిందని వీటిని త్వరలోనే స్థానిక ప్రధాన కార్యాలయానికి పంపనున్నట్టుగా అధికారులు తెలిపారు.ఎస్బీఎల్సీ స్థాయిలో తుది సమాలోచనల సదస్సు జరుగుతుందని ఎస్బీఐ ఆఫీసరుల్ల వివరించారు.