Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్థ సీఈవో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో తనదైన ముద్రవేసుకున్న చైనాకు చెందిన కంపెనీ వన్ప్లస్.. తొలి స్మార్ట్టీవీని భారత్లోనే విడుదల చేస్తున్నది. స్మార్ట్ ఫోన్ నుంచి స్మార్ట్ టీవీరంగంలోకి అడుగిడిన వన్ప్లస్.. ఈ ఉత్పత్తిని సెప్టెంబర్లో మార్కెట్లోకి తీసుకువస్తున్నట్టు సంస్థ సీఈవో పీటే లౌ స్పష్టతనిచ్చారు. అదీకూడా భారత మార్కెట్లోనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వన్ప్లస్ ఫోరంలో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే, స్మార్ట్టీవీకి సంబంధించి ధర గానీ, ఇతర వివరాలు గానీ వెల్లడించలేదు. స్మార్ట్టీవీ ప్రాజెక్ట్పై గత రెండేండ్లుగా పనిచేస్తున్నట్టు లౌ తెలిపారు. ఈ విభాగంలో విజయం సాధించేందుకు ఒక మార్కెట్పై పూర్తి ద ష్టి సారించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇప్పటికే భారత్లో కంటెంట్ ప్రొవైడర్లతో సత్సంబంధాలు ఉన్నాయని, తమతో భాగస్వామ్యానికి వారు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. తమ పరస్పర భాగస్వామ్యంతో యూజర్లకు గొప్ప కంటెంట్ను అందించనున్నట్టు తెలిపారు. అలాగే ఉత్తర అమెరికా, యూరప్, చైనాలోనూ టీవీలను తీసుకురావడంలో భాగంగా అక్కడి స్థానిక కంటెంట్ ప్రొవైడర్లతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. స్మార్ట్టీవీ విభాగంలో అగ్రగామిగా నిలవాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. ఇప్పటికే స్మార్ట్ఫోన్ తయారీ విభాగంలో ఉన్న షావోమీ, శామ్సంగ్, ఎల్జీ, మైక్రోమ్యాక్స్ కంపెనీలు టీవీలను తయారుచేస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలకు ఈ విభాగంలో వన్ప్లస్ గట్టి పోటీనివ్వనుంది.