Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్టీవీల విభాగంలో పోటీ రోజురోజుకు పెరిగిపోతోంది. మొబైల్స్ తయారీదారు లెనోవా అనుబంధ సంస్థ మోటరోలా భారత మార్కెట్లో చవక ధరలకే పలు ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్ సహకారంతో 32, 43, 50, 55, 65 అంగుళాల డిస్ప్లే పరిమాణాల్లో ఆరు కొత్త స్మార్ట్ టీవీలను సోమవారం మార్కెట్లోకి ఆవిష్కరించింది. భారతదేశంలో స్మార్ట్ టీవీలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో తాము ఈ మార్కెట్పై దృష్టిపెట్టినట్టుగా మోటరోలా తెలిపింది. ప్రధానంగా షావోమికి షాకిచ్చేలా ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ సందర్భంగా సెప్టెంబర్ 29 నుంచి ఈ టెలివిజన్లు కొనుగోలుకు అందుబాటులో ఉంచనున్నట్టుగా సంస్థ తెలిపింది. దాదాపు షావోమి ఎంఐ టీవీల మాదిరి ఫీచర్లు, అదే ధరతో వీటిని సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు షావోమి మంగళశారం భారతదేశంలో 65 అంగుళాల టీవీని విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోటరోలా మార్కెట్లోకి ఆధునిక టీవీలతో దూసుకురావడం విశేషం. మోటరోలా తీసుకొచ్చిన ఆరు టీవీలు ఆండ్రాయిడ్ 9 ఓఎస్ ఆధారంగా, నిరంతరాయమైన గేమింగ్ అనుభవం కోసం గేమింగ్ కంట్రోలర్ సపోర్ట్తో పనిచేస్తాయని కంపెనీ తెలిపింది.మోటరోలా 32 అంగుళాల హెచ్డీ రెడీ టీవీ ధరను కంపెనీ రూ.13,999గాను, 43 అంగుళాల ఫుల్ హెచ్డీ టీవీ ధరను రూ.24,999గాను, 43 అంగుళాల 4కె టీవీ ధరను రూ.29,999, 50 అంగుళాల 4కె టీవీ ధరను రూ.33,999గాను, 55 అంగుళాల 4కె టీవీ ధరను రూ.39,999గాను, 65 అంగుళాల 4కె స్మార్ట్ టీవీ ధరను రూ.64,999గాను మోటరోలా నిర్ణయించింది. ఆన్లైన్లో ఖరీదు చేసే వారి కోసం పలు ఆఫర్లను సైతం సంస్థ ప్రకటించింది.