Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్ధి 5 శాతానికి కుంగడం నిజంగా 'సర్ప్రైజ్'
- వచ్చే త్రైమాసికంలో మరింత తగ్గే అవకాశం..!
- మందమనంతో పాటు పలు సవాళ్లున్నాయి..
- సర్కారు నిరంతరాయ చర్యలు తీసుకుంటోంది
- సౌదీ సంక్షోభంతో ఆర్థికానికి మరిన్ని ఇబ్బందులు:
భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతం కనిష్టానికి పడిపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 5.5 శాతం కంటే తక్కువగా నమోదు కాకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీలతో సహా విశ్లేషకులందరూ అంచనా కట్టారని ఆయన అన్నారు. అయితే సర్కారు వెల్లడించిన గణాంకాలలో వృద్ధిరేటు 5 శాతంగా నమోదు కావడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. తొలిత్రైమాసికం వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ 5.8 శాతంగా అంచనాకట్టిందని.. అయితే పరిస్థితి కొంత సుముఖంగా లేని కారణంగా అంతకంటే తక్కువకు వృద్ధిరేటు పడిపోవచ్చని తాము అంచనా కట్టామని ఆయన అన్నారు. అయితే మీర జీడీపీ వృద్ధి 5 శాతానికి పడిపోవడం నిజంగా ఆశ్చర్యకరమేనని ఆయన అన్నారు. అయితే సర్కారు తీసుకుంటున్న పలు ఆర్థిక ఉద్దీపన చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పుంజుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అభివృద్ధి చెందిన అన్ని ఆర్థిక వ్యవసల వృద్ధి రెండో త్రైమాసికంలో మొదటి క్వార్టర్ కంటే తక్కువగా నమోదవుతూ వస్తోందని.. అయితే రెండో త్రైమాసికంతో వృద్ధికూడా కుంగే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే వృద్ధి తగ్గడానికి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మందగమన పరిస్థితులు ఒక్కటే కారణమని తాము చెప్పలేమని.. దేశీయంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు. మందగమన పరిస్థితులుపోయి ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కోలుకుంటుందని ఆడిగిన ప్రశ్నకు దాస్ సమాధానం ఇస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని అంచనా వేసి చెప్పడం కష్టమని ఆయన అన్నారు. మందగమనాన్ని అనేక విషయాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆయన అన్నారు.
మందగమనం స్పష్టంగా కనిపిస్తోంది..
దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని శక్తికాంత దాస్ అన్నారు. ఆర్థిక వ్యవస్థకు కొత్తవూపును ఇచ్చేందుకు గాను గత కొన్ని నెలలుగా ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తూ వస్తోందని ఆయన అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆర్బీఐ రెపోరేటును 1.10 శాతం మేర తగ్గించిందని ఆయన అన్నారు. సర్కారు సరైన చర్యలు తీసుకుంటే పరిస్థితులు చక్కబడొచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ దిశగా చురుగ్గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను దూరం చేస్తూ నిలకడగా నిలబెట్టేందుకు గాను రానున్న రోజుల్లో కూడా సర్కారు మరిన్ని చర్యలు తీసుకొనే అవకాశం ఉందని ఆయన అన్నారు.
స్థిరాస్తి రంగానికి ఊతం, ఎగుమతి ప్రోత్సాహక చర్యలు, బ్యాంకుల విలీనం, సూక్ష్మ, చిన్న మధ్య తరగతి పరిశ్రమల వారికి ప్రోత్సాహకాలు వంటి చర్యలు తీసుకకుందని ఆయన అన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ పెద్ద సమస్యగా మారిందని దీనిని నిలబెట్టేందుకు సర్కారు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు.
సౌదీ సంక్షోభంతో కొత్త సమస్యలు..
ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటోందని.. ఈ నేపథ్యంలో తాజాగా సౌదీ అరేబియాలో ఏర్పడిని చమురు సంక్షోభం దేశానికి మరో ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీనికి తోడు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధమేఘాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనబరుస్తోందని.. ఈ ఉద్రిక్తతలు కాస్త తగ్గితే పరిస్థితి మెరగవొచ్చని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కరెంటు ఖాతా లోటు పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.